నీటి యాజమాన్యం:

వాతావరణ పరిస్ధితులనుబట్టి మొదట 2 - 3 రోజుల కొకసారి తర్వాత 4 - 7 రోజుల కొకసారి నీరు పారించాలి డ్రిప్ పద్ధతి పాటించి నీరు సమృద్ధిగా పారి స్తే పెరుగుదల దిగుబడి అధికంగా ఉంటుంది. 20 లీటర్ల నీరుపట్టె  కుండలను భూమిలో డ్రిప్ జోన్లో పాదుల్లో అమర్చి పిచ్చర్ పద్ధతిలో నీటినివ్వాలి. కుండలోని చిన్న రంధ్రం ద్వార భుమిలోనికి నీరుకారి వేర్లకు నీరు అందుతుంది. నీటివసతి లేకపోతే చెట్లుబాగా పెరిగే వరకు 2-3 సంllల వరకువేసవిలో నీరుపోయాలి. నీరు తక్కువైతే కాయలు గట్టిగా మారి పండుబారవు. చెట్లు పాదుల్లో 8 సెం.మీ. మందం వేరుశనగ పొట్టు లేదా వారి పొట్టును వేసి తేమను ఎక్కువ కాలముండేటట్లు చూడాలి. వరసకు, వరసకు మధ్య 5శాతం వాలు కల్పించి వర్షపు నీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి. ఎండాకాలంలో నీరు పెడితేబాగా పెరిగి ముందుగా పంట నిస్తుంది.